PM Kisan 20th Installment: రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్...మరికొద్ది మీ మొబైల్ ఫోన్లో టింగ్ టింగు మంటూ...డబ్బులు జమ అయ్యే ఛాన్స్..ఎప్పుడంటే..?

PM Kisan 20th Installment: పీఎం కిసాన్ డబ్బులు అతి త్వరలోనే రైతుల అకౌంట్లో జమ అవ్వనున్నాయి. ఇప్పటికే ఒక దఫా పిఎం కిసాన్ డబ్బులు ఈ సంవత్సరం రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. ఇప్పుడు రెండోదప్ప రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లో ఆర్థికంగా తోడ్పాటున అందించేందుకు ముందుగానే వారి అకౌంట్లో డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

PM Kisan Samman Nidhi.

పీఎం కిసాన్

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు త్వరలోనే శుభవార్త వినిపిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana)యోజన (PM Kisan Yojana) డబ్బులు వేసేందుకు సన్నద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana)డబ్బులు మొత్తం ప్రతి సంవత్సరం 6000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తారు ఈ డబ్బును రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు. ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వం రుణం రూపంలో కానీ, సబ్సిడీ రూపంలో కానీ ఇవ్వడం లేదు అని గుర్తు చేసుకోవాలి. ఈ డబ్బులను నేరుగా ఒక గ్రాంట్ రూపంలో రైతుల ఎకౌంట్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. రైతులు ఈ డబ్బులను తమ వ్యవసాయ ఖర్చులకోసం కానీ వ్యవసాయేతర ఖర్చులకోసం కానీ ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఉంది. రైతులు ఈ డబ్బులు తమ కోసం ఖర్చు చేసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఎవరికి కానీ జవాబు దారి లేదు అని గుర్తుంచుకోవాలి.
పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా 20వ దఫా జమ అవ్వడానికి జూన్ లేదా జూలై మాసాల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు రైతుల ఎకౌంట్లో జమ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో 2 వేల రూపాయలు అతి త్వరలో రైతుల ఖాతాల్లో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరైతే రైతులు ఐదు ఎకరాల లోపు వ్యవసాయం కలిగి ఉంటారో... ఆదాయపన్ను చెల్లించని రైతులు ఈ పథకానికి అర్హులు అని చెప్పవచ్చు.
>> ప్రైవేట్ కంపెనీలు, ట్రస్ట్‌లు, సహకార సంఘాలు వంటి సంస్థలకు చెందిన భూయజమానులు ఈ స్కీంకు అనర్హులు
>> రాజ్యాంగ పదవులు నిర్వహించిన వారు పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana)డబ్బులు పొందడానికి అనర్హులు.
>> ప్రభుత్వ ఉద్యోగులు పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana)డబ్బులు పొందడానికి అనర్హులు.
>> ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ పొందుతున్న వారు అనర్హులు.
>> ఆదాయపు పన్ను చెల్లించేవారు పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana)డబ్బులు పొందడానికి అనర్హులు.
>> డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణులు పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana)డబ్బులు పొందడానికి అనర్హులు.
>> విదేశాల్లో నివసరించే ఎన్ఆర్ఐలు పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana)డబ్బులు పొందడానికి అనర్హులు.
తాజా వార్తలు
    Adithya author

    ఆదిత్య టైమ్స్ నౌ వార్తలు‌లో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, లైఫ్ స్టైల్ అంశాల...మరిన్ని చూడండి

    ఆర్టికల్ ముగింపు
    Subscribe to our daily Newsletter!
    తాజా వార్తలు