Padmanabhaswamy Temple: అనంత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం... 270 ఏళ్ల తర్వాత తొలిసారిగా... విశేషం ఏమిటంటే...

కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అరుదైన ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. దాదాపు 270 ఏళ్ల తర్వాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. అయితే దాదాపు 270 సంవత్సరాల తర్వాత జరిగిన మహా కుంభాభిషేకాన్ని వీక్షించడానికి నేడు పెద్ద ఎత్తున భక్తులు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

Padmanabhaswamy Temple, Kerala. Credit: Canva

శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం

కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అరుదైన ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. దాదాపు 270 ఏళ్ల తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. అయితే దాదాపు 270 సంవత్సరాల తర్వాత జరిగిన మహా కుంభాభిషేకాన్ని వీక్షించడానికి నేడు పెద్ద ఎత్తున భక్తులు అనంత పద్మనాభ స్వామి ఆలయానికి తరలివచ్చారు. చాలా పురాతన ఆలయంగా ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయిన నేపథ్యంలో ఈ గొప్ప ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు.
తిరువాంబాడి శ్రీ కృష్ణ ఆలయం(ప్రధాన మందిర సముదాయంలో )లో ‘‘తాళికాకుడములు (గర్భగుడి పైన ఉన్న మూడు గోపురాలు)’’, విశ్వక్సేన విగ్రహం పునఃప్రతిష్ట, అష్టబంధ కలశం ఈరోజు ఉదయం నిర్వహించినట్టుగా ఆలయ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 7.40 నుంచి 8.40 గంటల మధ్య శుభ సమయంలో పూజారులు ఈ ఆచారాలను నిర్వహించినట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి ప్రస్తుతం అధిపతిగా ఉన్న మూలం తిరునాల్ రామ వర్మ మందిరంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఆచారాలు ప్రారంభమయ్యాయి.
తిరునాల్ రామ వర్మ, ఇతర రాజకుటుంబ సభ్యుల సమక్షంలో తంత్రి మొదట తిరువాంబాడి ఆలయంలో ‘‘అష్టబంధ కలశం’’ నిర్వహించారని... ఆ తరువాత విశ్వక్సేన విగ్రహం పునఃప్రతిష్ట ఉదయం 8.00 గంటలకు జరిగిందని ఆలయ వర్గాలు తెలిపాయి. అయితే పునరుద్ధరించబడిన, పునఃప్రతిష్టించబడిన విశ్వక్సేన విగ్రహం సుమారు 300 సంవత్సరాల పురాతనమైనది. విగ్రహాలను సృష్టించడానికి ప్రత్యేకమైన పదార్థాల కలయికతో కూడిన సాంప్రదాయ పద్ధతి ‘కటు సర్కార యోగం’ విధానం ఉపయోగించారు.
అయితే ఈ ప్రతిష్టాపన సమయంలో అనంతపద్మనాభ స్వామి ఆలయ పరిసరాలు ‘‘నారాయణ’’ మంత్రంతో మార్మోగాయి. భక్తులు అరుదైన ఆచారాన్ని వీక్షించడానికి ఆలయ నాలుగు ప్రవేశ ద్వారాలపై ప్రత్యేక స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రతిష్టాపన మహోత్సవం వీక్షించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయం క్యూ లైన్లలో బారులు తీరారు.కేరళ గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ కూడా ఈ అరుదైన ఆచారాన్ని వీక్షించేందుకు ఆలయానికి వచ్చారు.
‘‘మహా కుంభాభిషేకం’’ కు ముందు చివరి వారంలో వివిధ రోజులలో ఆచార్య వరణం, ప్రసాద శుద్ధి, ధార, కలశం, ఇతర ఆచారాలు ఆలయంలో జరిగాయి. ఆధ్యాత్మిక శక్తిని బలోపేతం చేయడం, ఆలయం పవిత్రతను మరింతగా పెంపొందించడం మహా కుంభాభిషేకం లక్ష్యం అని ఆలయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
    Sumanth Kanukula author

    <p>సుమంత్ కనుకుల టైమ్స్ నౌ వార్తలు‌లో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అతను ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, జనరల్ అంశాలకు సంబం...మరిన్ని చూడండి

    ఆర్టికల్ ముగింపు